29.4 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

పెన్షన్ల పై శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్.. వారికి కూడా పెంచుతాం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కామారెడ్డిలో నామినేషన్ వేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గంలోనే మా సొంత తల్లిగారి ఊరు అని చెప్పుకొచ్చాడు. కామారెడ్డికి తనకు చిన్నప్పటి నుంచే అనుబంధం ఉంది. నేను కామారెడ్డికి వస్తే చాలా వస్తాయి. కేసీఆర్ వెంట కామారెడ్డి, ఎల్లారెడ్డికి కాళేశ్వరం నీళ్లు వస్తాయి. బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేస్తామి హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. కామారెడ్డి నియోజకవర్గంలో పల్లెలను అభివృద్ధి చేయాలని గంప గోవర్థన్ కోరడంతో తాను కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. బీడీ కార్మికుల పెన్షన్ కూడా రూ.5వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇండియాలో 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నా తెలంగాణ తప్ప ఎక్కడా పెన్షన్ ఇవ్వడం లేదు. కటాఫ్ డేట్ 2014 వరకు పెట్టడంతో కొత్త వారికి పెన్షన్ రావడం లేదని కొందరూ ఆందోళన చేస్తున్నారు. కొత్త బీడీ కార్మికులు లక్ష మంది ఉంటారు కావచ్చు. వారందరికీ బీడీ పెన్షన్ మంజూరు చేస్తాం. పెన్షన్ రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్