ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. మళ్లీ అధికారమే లక్ష్యంగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఆరు రోజులుగా కొనసాగుతున్న యాత్రలో జగన్ ప్రజలతో మమేకమవుతూ ముందుకు కదులుతున్నారు. మహిళలు, యువతులు, పిల్లలు, కార్మిక సంఘాల నేతల నుంచి బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోంది. అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ ఆరో రోజు అన్నమ య్య జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. చీకటిమానుపల్లె నుంచి యాత్ర ప్రారంభమ వుతుంది. ములకలచెరువు, పెదపాలెం, వేపురికోట, బుర్రకాయలకోట, గోల్లపల్లి మీదుగా అంగళ్లు చేరుకుంటారు సీఎం జగన్. మధ్యాహ్నం 3.30 గంటలకు మదనపల్లెలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్, చౌడేపల్లి..సోమల మీదుగా అమ్మ గారిపల్లె చేరుకుంటారు. రాత్రి అమ్మగారిపల్లె శివారులో సీఎం జగన్ బస చేస్తారు. జగన్ బస్సు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు.