31.7 C
Hyderabad
Monday, May 12, 2025
spot_img

ఆరో రోజుకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర

      ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు సమర శంఖం పూరిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్‌ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. మళ్లీ అధికారమే లక్ష్యంగా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఆరు రోజులుగా కొనసాగుతున్న యాత్రలో జగన్‌ ప్రజలతో మమేకమవుతూ ముందుకు కదులుతున్నారు. మహిళలు, యువతులు, పిల్లలు, కార్మిక సంఘాల నేతల నుంచి బస్సు యాత్రకు విశేష స్పందన వస్తోంది. అడుగడుగునా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ ఆరో రోజు అన్నమ య్య జిల్లాలో సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభంకానుంది. చీకటిమానుపల్లె నుంచి యాత్ర ప్రారంభమ వుతుంది. ములకలచెరువు, పెదపాలెం, వేపురికోట, బుర్రకాయలకోట, గోల్లపల్లి మీదుగా అంగళ్లు చేరుకుంటారు సీఎం జగన్‌. మధ్యాహ్నం 3.30 గంటలకు మదనపల్లెలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. సభ అనంతరం నిమ్మనపల్లి, బోయకొండ క్రాస్‌, చౌడేపల్లి..సోమల మీదుగా అమ్మ గారిపల్లె చేరుకుంటారు. రాత్రి అమ్మగారిపల్లె శివారులో సీఎం జగన్‌ బస చేస్తారు. జగన్‌ బస్సు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వైసీపీ శ్రేణులు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్