39.4 C
Hyderabad
Friday, April 25, 2025
spot_img

కర్నూలుకు ఏపీ హైకోర్టు… క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం తెలిపింది. రాష్ట్ర హైకోర్టు తరలింపు పై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సి ఉందని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైన కేంద్రం తీసుకుంటుందని వెల్లడించింది.

గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును అమరావతి వేదికగా ఏర్పాటు చేశారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు సీఎం జగన్. ఈ క్రమంలో విశాఖను పరిపాలన, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలని సీఎం జగన్ ప్రతిపాదించారు. ఈ క్రమంలో మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి వివరించారు.

Latest Articles

టిబిజెడ్ -ది ఒరిజినల్ స్టోర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2025: చరిత్ర, సంస్కృతి మరియు విలాసాలను మిళితం చేసే ఒక ముఖ్యమైన సందర్భంలో భాగంగా, భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆభరణాల బ్రాండ్ అయిన టిబిజెడ్ -ది ఒరిజినల్, నేడు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్