వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడికి రిమాండ్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ ని శనివారం కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇవాళ ఉదయం కడప జిల్లాలోని పులివెందులలో ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో కాసేపు విచారించిన అధికారులు హైదరాబాద్ తరలించారు. తాజాగా సీబీఐ కోర్టులో ఉదయ్ ని హాజరుపర్చడంతో న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. కాగా వివేకా హత్య జరిగిన రోజు ఎంపీ అవినాశ్ తో పాటు ఘటన స్థలంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా అధికారులు గుర్తించారు.

Latest Articles

తమిళనాడులో ఘోరం..మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి…మృతి

తమిళనాడులో ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తిరువల్లూర్‌ జిల్లాలో జరిగింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై ఆకృత్యాలు పెరిగిపోవడంతో ఆగ్రహం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్