వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, ఎడ్యూకేషన్ కిట్ అందిస్తున్నారు. విద్యార్థులకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, షూలు ప్రభుత్వం ఇస్తోంది. ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. దశల వారీగా విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పెట్టనుంది ప్రభుత్వం.
మొదటి దశలో 8 జిల్లాల్లో మొత్తం 1,269 స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్, 33 జూనియర్ కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అమలు చేయనున్నారు. అలాగే మొత్తం 14 లక్షల 4 వేల మంది విద్యార్థులకు మొదటి దశలో బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేస్తున్నారు.


