31.2 C
Hyderabad
Thursday, September 28, 2023

భర్త దగ్గర పది రూపాయిలు తీసుకొని…ప్రియుడితో పరారు

కొత్తగా పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. ఆ నవ వధువు ఏం చేసిందంటే, భర్త అత్తమామలతో కలిసి దేవాలయానికి వెళ్లింది. చక్కగా పూజలు చేసింది. భోజనాలకు ముందు వాష్ రూమ్ కి వెళ్లాలని చెప్పి భర్త దగ్గర రూ.10 తీసుకుంది. ఇంతకీ రాదు, అంతకీ రాదే… గంట సేపైనా రాలేదు. అత్తామామలు, భర్త కంగారు పడ్డారు. ఏమైపోయిందంటూ గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు.

భర్త వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణ మొదలైంది. దేవాలయం దగ్గర, ఇంకా చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో పుటేజీలు తీసి చూస్తే అసలు విషయం తెలిసింది. పెళ్లి కూతురు తాపీగా నడుచుకుంటూ గుడి బయటకు వచ్చింది. అక్కడే ఒక రెడ్ బైక్ పై అప్పటికే రెడీగా ఉన్న ప్రియుడితో కలిసి పరారైపోయింది.

ఇవన్నీ చూసిన అత్తమామలు, భర్త అవాక్కయిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ఉత్తర ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగింది. జౌన్ పూర్ కి చెందిన యువకుడికి, అజంఘడ్ కి చెందిన అమ్మాయితో ఫిబ్రవరి 10న వివాహమైంది. పదిరోజుల తర్వాత పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వింధ్య వాసిని దేవాలయానికి వెళ్లారు. అప్పుడే ఈ అనుకోని ఘటన జరిగింది.

ఆ అమ్మాయి భర్త ఫిర్యాదు చేయలేదని, చేస్తే తప్పకుండా విచారించి వారెక్కడికి వెళ్లింది? ఎక్కడ ఉన్నది కనిపెడతామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇది మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లికూతురి తల్లిదండ్రులే పడతారని వీళ్లూ లైట్ తీసుకున్నారని చెబుతున్నారు.

Latest Articles

గణపతికి ఘనంగా వీడ్కోలు పలికిన భక్తులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి ఈ మధ్యాహ్నం తర్వాత హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
288FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్