అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చత్తీస్ఘడ్ నుంచి బ్రతుకుతెరువు కోసం పదేళ్ల క్రితం ఒక కుటుంబం గౌరిదేవిపేట గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక నాలుగేళ్ల చిన్నారి ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన రాము చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు రోజుల నుంచి నలతగా ఉండడంతో చిన్నారిని తల్లి అడగడంతో చిన్నారి అసలు విషయం బయటపెట్టింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు రాముపై పోక్సో కేసు నమోదు చేశారు.
అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో దారుణం
0
175
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


