తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలలో మా వ్యూహం మాకుంది అని ఆమె అన్నారు. బూత్ లెవల్ నుంచి పార్టీ బలోపేతం పని చేస్తున్నామని, పొత్తులకు సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. కేంద్రం పెద్దల ఆదేశాల మేరకే తాము పోటీ చేసే స్థానాలు ఖరారు అవుతాయని చెప్పారు. టీడీపీ, జనసేన అన్ని సీట్లు ఇంకా ప్రకటించ లేదని, బీజేపీ అధిష్టానం పొత్తు ఖరారు చేశాక పోటీ చేసే సీట్లపై ఆలోచన చేస్తామన్నారు. అప్పటి వరకు బీజేపీ175 ఎమ్మెల్యే, 25 ఎంపీ సీట్లలో పోటీ చేసేలా పని చేస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.