30.1 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

సముద్రంలో ఇండియన్‌ నేవీ మరో ఆపరేషన్‌

   ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌ కావడంతో ఇండియన్‌ నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. అందులో ఉన్న 23 మంది పాక్‌ పౌరులైన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఇతర దేశాల నౌకలు రిస్క్‌లో ఉన్నప్పు డు రక్షించేందుకు ఎల్లప్పుడు ముందుండే భారత నేవీ మరోమారు సాహసం చేసింది. హిందూ మహా సముద్రం లో హైజాక్‌ అయిన ఇరాన్‌ చేపల బోటును, అందులో ఉన్న పాకిస్థాన్ కు చెందిన 23మంది సిబ్బందిని రక్షించింది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపానికి దగ్గర్లో ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్‌ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ బోటును, సిబ్బందిని రక్షించేం దుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు భారత నేవీ ప్రకటించింది. దీంతో తొలుత INS సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న AI కంబార్‌ బోటును అడ్డగించింది. ఆ తర్వాత INS త్రిశూల్‌ నౌకదానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ జాతీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత నేవీ ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీ లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.  

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్