హైదరాబాద్లో హోటళ్లు, లాడ్జీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. నగర పోలీసుల ఆధ్వర్యంలో మలక్పేట్, చార్మినార్, ఐఎస్ సదన్ పోలీస్ డివిజన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, లాడ్జీలలో అతిథుల రిజిస్టర్లను పరిశీలించారు. కస్టమర్ల గుర్తింపు పత్రాలను తనిఖీ చేశారు. సందర్శకుల వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా అనే అంశంపై ఆరా తీశారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాల నివారణే లక్ష్యమని పోలీసులు వెల్లడించారు. భద్రతా ప్రమాణాల అమలుపై హోటల్ యాజమాన్యాలకు సూచనలు చేశారు. అదే విధంగా సుల్తాన్బజార్ పోలీసుల ఆధ్వర్యంలోనూ ఆయా పరిధిలోని హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. కస్టమర్ల వివరాలు, రిజిస్టర్లు, గుర్తింపు పత్రాలను పరిశీలించి నిబంధనల అమలుపై ఆరా తీశారు.
హైదరాబాద్లో హోటళ్లు, లాడ్జీలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
0
19
Latest Articles
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
- Advertisement -
- Advertisement -


