రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చెత్త సేకరణ పట్ల అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో కంపు కొడుతోందని, అనారోగ్యాలబారిన పడే ప్రమాద ముందని ఆందోళన చెందుతున్నారు. అసలే వానాకాలం కావడంతో మరింత బెంబేలెత్తిపోతున్నారు. చెత్త సేకరణకు కావాల్సిన వాహనాలు, సిబ్బంది అందుబాటులో ఉన్నాయని, కేవలం మరమ్మ త్తుల పేరుతో మామూళ్లు వసూలు చేస్తూ వాహనాలను షెడ్డుకే పరిమితం చేశారని విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యంతో పట్టణంలోని ప్రధాన విధుల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి గుట్టలను తలపి స్తుందని ఇకనైనా స్పందించి వెంటనే చెత్త సేకరణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహ రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


