ఢిల్లీ మద్యం స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి లేడీ డైనమిక్ ఆఫీసర్ గుర్తున్నారా.. కవిత అరెస్ట్ సందర్భంగా కేటీఆర్ , హరీష్ రావ్ వాదనకు దిగుతుంటే.. వారికి దీటుగా సమాధానం ఇచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీసరే భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్.. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ గా బాధ్యతలు వహిస్తున్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ లో కుట్రలను వెలుగులోకి తీసుకువస్తున్న మహిళా అధికారిణి.
విధుల పట్ల నిబద్ధత ఉన్న అధికారిగా పేరు తెచ్చుకున్న భానుప్రియ మీనా ఢిల్లీ మధ్యం స్కామ్ కేసులో హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చి కవితకు వారెంట్ అందజేసి, అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించా రు. అరెస్ట్ ను నిలదీసిన కేటీఆర్, హారీశ్ రావులకు దీటుగా సమాధానమిచ్చి.. వారి అభ్యంతరాలను తోసిపుచ్చి కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉందని.. ఆమెను అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారణ కాగలదని కేటీఆర్ వాదించారు. కానీ, వారి వాదనలను భానుప్రియ మీనా కోట్టివేశారు. అంతే కాదు. ఢిల్లీ మద్యం కేసులో కవిత ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ.. మద్యం కుంభకోణంలో ఆమె ఏఏ అక్రమాలకు పాల్పడ్డారో కక్కించడంలోనూ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారు భానుప్రియ మీనా. కవితనే కాదు.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను, ఇతర నిందితులను ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టడంతో పాటు.. పలువురు నిందితులు అప్రూవర్ లుగా మార్చడం లోనూ డైనమిక్ లేడీ కీలక పాత్ర వహిస్తున్నారు.
రాజస్థాన్ కు చెందిన భానుప్రియ మీనా మొదట ఐటీ శాఖలో పనిచేశారు. మూడేళ్లుగా డెప్యుటేషన్ పై ఈడీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. భానుప్రియ మీనా పై ఆమ్ ఆద్మీపార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. విధినిర్వహణలో చాలా కఠినం గా వ్యవహరిస్తున్నారని, సాక్షులను వేధింపులకు గురిచేస్తూ. ఇబ్బందులు పెడుతున్నారని గతంలో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు. ప్రస్తుతం భానుప్రియ మీనా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని కేసు పెట్టేందుకు బీఆర్ ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. ఆ కేసులను భాను ప్రియ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.


