దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల పోటాపోటీ నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోం ది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆప్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రధాని నివాసం ముట్టడికి ఆప్ కార్యకర్తలు బయలుదేరారు. మరోవైపు అవినీతి చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టయిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేప ట్టింది. ఆప్, బీజేపీ పోటాపోటీ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
ఆప్ నిరసన కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. రెండు పార్టీలు నిరసనలకు పిలు పునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే అధికారులు భద్రత ను కట్టుదిట్టం చేశారు. ప్రధాని నివాసం, మెట్రో స్టేషన్లు, సెంట్రల్ ఢిల్లీలో భారీగా పోలీసులు, కేంద్ర బల గాలను మోహరించారు. ఆందోళనలకు దిగిన ఆప్ నేతలను, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఢిల్లీలో ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.