ఆఫ్ఘనిస్తాన్ ను భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3 గా నమోదయింది. ముఖ్యంగా ఫైజాబాద్ నగరం రెండు సార్లు వరుసగా భూమి కంపించడంతో గడగడలాడింది. జనం బయటకు పరుగులు తీశారు. 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు ఆరంభమయ్యాయి. వారం రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో భూమి కంపించడం ఇది మూడో సారి. భారతదేశం లోని జమ్మూ కశ్మీర్ లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఫైజాబాద్ లో అర్థరాత్రి 12.28 నిముషాలకు, 12. 55 నిముషాలకు వరుసగా భూమి కంపించింది. రెండుసార్లు భూకంప తీవ్రత 4.4 గా ఉంది. జనం భయపడినా, ఆస్తి నష్టమైనట్లు తెలియలేదు.