27.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

త్వరలో గద్వాలలో వైద్య కళాశాల.. ప్రకటించిన సీఎం కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. గద్వాలలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంను సీఎం ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. నూతన భవనంలో పూజలు నిర్వహించిన అనంతరం.. పీజేపీ క్యాంపు స్థలంలో కొత్తగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం, నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ నెం.1 స్థానంలో ఉందని అన్నారు. తలసరి ఆదాయంలో.. అలాగే తాగునీటి సరఫరా విషయంలో మొదటి స్థానంలో ఉన్నామని వ్యాఖ్యానించారు.

ఉద్యమ సమయంలో గద్వాల ప్రజల అవస్థలు చూసి చాలా బాధపడ్డానని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ బాధను తొలగించుకొని సమస్యలన్నింటిని ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామని అన్నారు. గట్టు ఎత్తిపోతల పూర్తయితే.. గద్వాల బంగారు తునకలా మారుతుందని సీఎం అభిప్రాయ పడ్డారు. త్వరలో గద్వాలలో వైద్య కళాశాల కూడా రాబోతుందని చెప్పారు. ముందుముందు అనేక అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. ఐటీ రంగంలో రూ.2.47 లక్షల కోట్లకు చేరుకున్నామని కేసీఆర్ వివరించారు. త్వరలో గద్వాలలో వైద్య కళాశాల కూడా రాబోతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జిల్లాలో ముందుముందు అనేక అద్భుతాలు జరుగుతాయన్న సీఎం.. ఐటీ రంగంలో రూ.2.47 లక్షల కోట్లకు చేరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్​గౌడ్, నిరంజన్​రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్