స్వతంత్ర, వెబ్ డెస్క్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరికపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల ఏపీ మనిషిని వ్యాఖ్యానించిన రేవంత్.. తెలంగాణ తెచ్చుకుందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికని అన్నారు. షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఉరుకుంటామా? అంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి తెలంగాణకి నాయకత్వం వహించరు. షర్మిల ఏపీ కాంగ్రెస్ కి పనిచేస్తే స్వాగతిస్తానని… షర్మిల ఏపీసీసీ చీఫ్ అయితే సహచర పీసీసీ చీఫ్ గా ఆమెని కలుస్తానని అన్నారు. నేను పీసీసీ చీఫ్ గా ఉన్నన్ని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండదన్నారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించ పరచడమే అవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
షర్మిల కాంగ్రెస్ చేరికపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
0
302
Previous article
Latest Articles
breaking: కార్మికులపై పడ్డ ద్రవ ఉక్కు…8 మంది కార్మికులు మృతి
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్టీల్ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. సీసీడీ విభాగంలో...
- Advertisement -
- Advertisement -


