స్వతంత్ర, వెబ్ డెస్క్: రైల్వేకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ చూపించిన తెగువ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్ప్రెస్ శనివారం తెల్లవారుజామున వరంగల్ స్టేషన్కు చేరుకుంది. రైలు ఆగుతున్న సమయంలో ఓ మహిళ కిందకు దిగేందుకు ప్రయత్నించగా.. పట్టు జారడంతో ఆమె ప్లాట్ఫాంపై పడిపోయారు. అయితే ఆ మహిళ భయంతో రైలు తలుపు హ్యాండిల్ను గట్టిగా పట్టుకోవడంతో ఆమెను రైలు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ సోనాలీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రయాణికురాలిని ప్లాట్ఫాం వైపు గట్టిగా లాగి కాపాడారు. కానిస్టేబుల్ కాపాడకపోయి ఉంటే ఆమె రైలు, ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయేది. కాగా విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సోనాలీని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా కానిస్టేబుల్ తెగువను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
మహిళా కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు సెల్యూట్
0
237
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


