25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

మహిళా కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు సెల్యూట్

స్వతంత్ర, వెబ్ డెస్క్: రైల్వేకు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ చూపించిన తెగువ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వెళ్లే మణుగూరు ఎక్స్‌ప్రెస్ శనివారం తెల్లవారుజామున వరంగల్ స్టేషన్‌కు చేరుకుంది. రైలు ఆగుతున్న సమయంలో ఓ మహిళ కిందకు దిగేందుకు ప్రయత్నించగా.. పట్టు జారడంతో ఆమె ప్లాట్‌ఫాంపై పడిపోయారు. అయితే ఆ మహిళ భయంతో రైలు తలుపు హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకోవడంతో ఆమెను రైలు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ సోనాలీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ప్రయాణికురాలిని ప్లాట్‌ఫాం వైపు గట్టిగా లాగి కాపాడారు. కానిస్టేబుల్ కాపాడకపోయి ఉంటే ఆమె రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయేది. కాగా విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సోనాలీని ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళా కానిస్టేబుల్ తెగువను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్