స్వతంత్ర, వెబ్ సైట్: రైతులకు వ్యవసాయం లాభసాటి చేసేందుకు వినూత్నమైన విధానాలను మోడీ సర్కార్ తీసుకొస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్స్, ఫసల్ భీమా యోజన లాంటి పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కనీస మద్దతు ధర 2014తో పోలిస్తే 5.7 రెట్లు పెరిగిందని తెలిపారు. దేశంలో బియ్యం ఎగుమతులు 109శాతం పెరిగాయి.. వంట నూనెల దిగుమతి తగ్గించామన్నారు. రైతుల నుంచి నూనె గింజల సేకరణ 15 వందల శాతం పెరిగిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం రుణ ప్రణాళికను ఖరారు చేసిందని స్పష్టం చేశారు.


