స్వతంత్ర, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కందుకూరులో దారుణం జరిగింది. మాచవరం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాధిత మహిళ నిందితుల చెర నుంచి తప్పించుకొని సమీపంలోని పెట్రోల్ బంక్లోకి వెళ్లింది. దీంతో అక్కడ పనిచేసే సిబ్బంది యువతిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధిత మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితుల్లో ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. మరో ఇద్దరు గూర్ఖాలుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై అత్యాచారయత్నం కేసుతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.