స్వతంత్ర, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC) ఫైనల్ మ్యాచ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. లండన్లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో తొలుత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే భారత్, ఆసీస్ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లను ధరించి మైదానంలో అడుగు పెట్టారు. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ రైలు ప్రమాదంలో 288 దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. దీంతో మృతి చెందిన వారికి సంతాపసూచికంగా ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులర్పించారు. మరోవైపు నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో టీమ్ఇండియా బరిలోకి దిగింది. అలాగే తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ వికెట్ కీపర్గా జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మకిది 50వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం.
ఒడిశా రైలు ప్రమాద మృతులకు నివాళిగా నల్ల రిబ్బన్లతో క్రికెటర్లు
0
422
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


