స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి నియమితులయ్యారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయనకు చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు హైకోర్టు సీజేగా ఉన్న ప్రశాంత్ కుమార్ మిశ్రా సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
2018లో ప్రతిపక్షనేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తితో దాడి పిటిషన్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల వివాదంపైనా ఈయనే విచారణ చేశారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం గతంలో చేపట్టిన సకల నేరస్తుల సర్వేలోని లోటుపాట్లను కూడా ఎత్తిచూపారు.