35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

రూ.2000నోట్ల ఉపసంహరణకు అసలు కారణం ఇదే!

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రూ.2000 నోట్ల ఉపసంహరణకు దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరగడమే కారణమని RBI తెలిపింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా డిజిటల్, యూపీఐ లావాదేవీలు భారీగా పెరిగాయని.. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా దాదాపు 87.92 బిలియన్ లావాదేవాలు జరిగాయని పేర్కొంది. కేవలం 2022 సంవత్సరంలోనే వాటి విలువ రూ.14.92లక్షల కోట్లు ఉంటుందని చెప్పింది. అంతేకాకుండా  10.8 శాతం మాత్రమే రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఈ ఏడాది మార్చి నెల వరకు దేశంలో చలామణిలో ఉన్న నగదు రూ.31.33 లక్షల కోట్లు. ఇందులో రూ.2,000 నోట్ల వాటా రూ.3.62 లక్షల కోట్లగా ఉందని వెల్లడించింది. ఇందులోనూ ఎక్కువమొత్తం బ్యాంకుల్లోనే ఉందని.. లేదా అవినీతిపరుల వద్ద ఉండొచ్చని తెలిపింది. సామాన్యుల దగ్గర మాత్రం రూ.2000నోట్లు చాలా తక్కువగా ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.

గత రెండేళ్లుగా రూ.2000 నోట్ల చలామణి దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి బ్యాంకులకు వెళ్లిన ఈ నోట్లు తిరిగి వాడుకలోకి రాలేదు. ఏటీఎంలలోనూ ఈ నోట్ల జారీని బ్యాంకులు నిలిపివేశాయి. దీంతో ప్రజల దగ్గర రూ.500, రూ.200, రూ.100 నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. అందువల్ల రూ.2000నోట్లు ఉపసంహరణ నిర్ణయం సామాన్యులపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: రూ.2000నోట్ల రద్దుపై స్పష్టత ఇచ్చిన RBI

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్