మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్లో భూమి కంపించిందని.. దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అయితే భూ అంతర్భాగంలో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. కాగా, భూ ప్రకంపనలతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అటు, మేఘాలయాలో ఆదివారం సాయంత్రం 3.33 గంటలకు భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. సౌత్ గారో హిల్స్లో 3.5 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది.