మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 7.47 గంటలకు పశ్చిమ కాశీ హిల్స్లో భూమి కంపించిందని.. దీని తీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. అయితే భూ అంతర్భాగంలో దాదాపు 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. కాగా, భూ ప్రకంపనలతో జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అటు, మేఘాలయాలో ఆదివారం సాయంత్రం 3.33 గంటలకు భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. సౌత్ గారో హిల్స్లో 3.5 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ తెలిపింది.
మేఘాలయలోని పశ్చిమ కాశీ కొండల్లో భూకంపం
0
383
Previous article
Latest Articles
మమతకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ గుర్తింపు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని సభలో ప్రతిపక్ష నేతగా బెంగాల్ స్పీకర్ రథీంద్ర బోస్...
- Advertisement -
- Advertisement -


