బైజూస్ కుంభకోణంపై విద్యార్థి సంఘాల తిరుగుబాటు

        కార్పొరేట్ విద్యా వ్యవస్థ వేళ్లూనుకున్న తరుణంలో విద్యాసంస్థల స్వరూపాలు మారిపోయాయి. ఆన్ లైన్ పాఠాల జోరు పెరిగింది.ఈ క్రమంలో విద్య పేరుతో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్న సంస్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో విద్యా రంగాన్ని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న బైజూస్ ను రాష్ట్రంలో నిషేధించాలంటూ గుంటూరులో విద్యార్థి సంఘాల నాయకులు నిరసనలు తెలిపారు. ఏఐవైఎఫ్ , ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బైజూస్, ఆకాశ్ విద్యా శిక్షణ కేంద్రాల వద్ద నిరసనలు చేపట్టారు.
ఈ ఆందోళనల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వలీ పాల్గొన్నారు. అర్థం కాని చదువులతో  విద్యార్థుల భవితవ్యం పూర్తిగా దెబ్బతింటుందని, బైజూస్ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని విమర్శించారు. ట్యాబ్ ల పంపిణీలో బైజూస్ కుంభకోణం జరిగిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిం చారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బైజూస్ చేసుకున్న ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకా రులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల నేతలను పోలీస్ వాహనాల్లో ఎక్కించుకు వెళ్లారు .

Latest Articles

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్ వ్యాపారిని అరెస్టు చేసిన కొచ్చి పోలీసులు

సైబర్‌ క్రైమ్‌ కేసులో హైదరాబాద్‌ వ్యాపారిని కొచ్చి పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు రావడంతో ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి అల్లంరాజు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్