కడప జిల్లా పులివెందులలో జగన్ సతీమణి భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతు న్నారు. పులివెందులలో జగన్ను, కడప ఎంపీ అభ్యర్థి అవినాశ్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు భారతి.