26.2 C
Hyderabad
Saturday, May 18, 2024
spot_img

తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న ఎండలు

   తెలుగు రాష్ట్రాలను ఎండలు కుదిపేస్తున్నాయి. రాత్రి ఉక్కుపోత, పగలు బీభత్సమైన ఎండలతో ప్రజలు అల్లాడిపో తున్నారు. తెలంగాణలో మొన్నటి వరకు పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డుయ్యాయి. 40కి పైగా మండలా ల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఖమ్మం జిల్లా పమ్మి మండలం, జగిత్యాల జిల్లా నేరెళ్లలలో 46.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, నాలుగు జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్యన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది.

     ఇక ఏపీలో సైతం ఎండలు దంచికొడుతున్నాయి. వేడిగాలుల తీవ్రతా పెరిగింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడిగాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. నిన్న 63 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వేడిగాలులు వీచాయన్నారు. అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో ఏకంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నట్లు సమాచారం. వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న ఐదుగురు చనిపోయినట్లు తెలు స్తోంది.

Latest Articles

ఏపీలో ఎన్నికల ఘర్షణలపై సిట్ దర్యాప్తు

   ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ దర్యాప్తు ప్రారంభించనుంది. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి నివేదిక తయారు చేయనుంది. అంతుకు ముందు సిట్ అధికారులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్