ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారుల చేతివాటం

ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారులు చేతివాటం చూపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అర్హుల లిస్టులో పేరు కల్పిస్తామని 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ బిల్లులను మంజూరు చేయడానికి 10 వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన పైరవీకారులు తమ స్వలాభం కోసం మార్చుకుంటున్నారు. పేదల ప్రయోజనమే లక్ష్యంగా ఏ పథకాన్ని అనౌన్స్‌ చేసినా దళారులు ముందు వరుసలో ఉంటూ తమ చేతివాటం చూపిస్తున్నారు. అర్హత లేకున్నా పథకంలో లబ్ధి కల్పిస్తామని బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం జలాల్‌పూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్‌, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తామే ఇల్లు వచ్చేలా చేశానని నమ్మబలుకుతున్నారు. బిల్లు సాంక్షన్‌ అవ్వాలంటే తనకు 10 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియోతో పాటు ఓ వీడియోను లబ్ధిదారులు రహస్యంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Latest Articles

మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్