ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడ లో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోల్లో మోదీ పాల్గొననున్నారు. ఆయా సభలు, రోడ్ షోలకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. మే 6న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. మే 8న మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు మోదీ.
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు
0
361
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


