ఏపీలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

    ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమండ్రి, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడ లో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోల్లో మోదీ పాల్గొననున్నారు. ఆయా సభలు, రోడ్‌ షోలకు టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ కూడా హాజరుకానున్నట్లు తెలిపారు. మే 6న సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వేమగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి సభలో పాల్గొంటారు. మే 8న మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య జిల్లా పీలేరు సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సి పల్‌ స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్‌ వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహిస్తారు మోదీ.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్