Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ఆదోని అభివృద్ధిలో నేతల వాటా ఎంత?

      మూడు వైపులా కర్ణాటక సరిహద్దులు… 157 ఏళ్ల క్రితమే బ్రిటీష్ పాలకులు మున్సిపాలిటీ గా తీర్చిదిద్దిన పట్టణం. అప్పటి నుంచి 90వ దశకం వరకు వాణిజ్య కేంద్రంగా ఒక వెలుగు వెలిగింది. వేలమందికి ఉపాధినిచ్చింది. కానీ అదంతా ఇప్పుడు గత వైభవంగా మారిపోయింది. ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. కర్నూలు జిల్లాలో రెండో ముంబయిగా పేరుపొందిన… ఆ నియోజకవర్గం పేరు ‘ఆదోని’.ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే ఆదోని రాజకీయాల వివరాల్లోకి వెళదాం.

      రాష్ట్రంలోని అతిపెద్ద పత్తి మార్కెట్ గా ఆదోని పేరుపొందింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోని నియోజకవ ర్గంలో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. 1952 నుంచి 15సార్లు ఎన్నికలు జరగగా… కాంగ్రెస్ ఆరు సార్లు, టీడీపీ 4 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. నియోజక వర్గంలో 2 లక్షల 57వేల 640 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు ఒక లక్షా 27 వేల 903 ఓటర్లుంటే, మహిళలు 1 లక్షా 29 వేల 688 మంది ఉన్నారు. ఇక 2019 లో వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. అతనికి 74 వేల 109 ఓట్లు వచ్చాయి. సమీప టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడికి 61 వేల 790 ఓట్లు వచ్చాయి. దీంతో 12 వేల 319 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే జనసేన పార్టీ అభ్యర్థి మల్లప్పకి 11వేల 898 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 65.4 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.

     ఆదోనీ పట్టణంలో రోజురోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. జనాభాకు తోడు వాహనాలు పెరిగాయి. భారీ వాహనా లన్నీ పట్టణాల్లోంచి వెళ్లడం వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. దశాబ్దాల తరబడి వినిపిస్తున్న బైపాస్ రోడ్డు సమస్య ఇప్పటికీ తీరలేదు. అటు తెలుగుదేశం పరిపాలనలో, ఇటు వైసీపీ ఏలుబడిలో కూడా ఆదోనికి బైపాస్ రోడ్డు మంజూరు కాలేదు. నిజానికి బైపాస్ వస్తే ట్రాఫిక్ కష్టాలు 90శాతం తీరతాయని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆదోని నియోజకవర్గంలో రహదారుల సమస్యలు తీరలేదని, ఏ ప్రభుత్వం వచ్చినా తమ బతుకుల్లాగే, గతుకుల దారులు అలాగే ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిమాండ్ ఉండిపోయింది. గ్రిడ్స్ ద్వారా మంచినీటి సమస్య పరిష్కరించాలి. మండగిరిలో తాగునీటి పథకం, ఎస్ఎస్ ట్యాంకుల నిర్వహణ, విస్తరణకు చర్యలు చేపట్టాల్సి ఉంది.

    ఐదేళ్లకోసారి నాయకులు చెప్పే మాటలకు ఎప్పటిలా ఆదోని ప్రజలు మోసపోతూనే ఉన్నారు. వరుసగా రెండుసార్లు వైసీపీ నుంచి విజయం సాధిస్తున్న సాయిప్రసాద్ రెడ్డికి సీటు దక్కేలా ఉంది. తెలుగుదేశానికి వచ్చేసరికి మూడుసార్లు గెలిచి, మూడుసార్లు ఓడిపోయిన కమ్మసామాజిక వర్గానికి చెందిన మీనాక్షి నాయుడు మళ్లీ పట్టువదలని విక్రమార్కు డిలా రేసులోకి వచ్చారు. అయితే తనకి పోటీగా తెలుగుదేశం పార్టీలో సుమారు ఐదుగురు రెడీగా ఉన్నారు. వారు సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి తమ సామాజికవర్గం నేతకిస్తారా? లేక బీసీలకు కేటాయిస్తారా? అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ మీనాక్షి నాయుడికే ఇస్తే, సీటు కోసం పోటీ పడుతున్నవారు సహాయ నిరాకరణ చేసేలా ఉన్నారు. ఇక ఉమ్మడిలో జనసేన కి సీటు లేకపోతే, ఆ ఓట్లు గంపగుత్తగా టీడీపీకి పడతాయా? చీలిపోతాయా? అనేది ఇంకా క్లారిటీ లేదు.

     ఆదోని పేరు రకరకాలుగా రూపాంతరం చెందింది. యాదవులు ఎక్కువగా ఉండటం వల్ల యాదవగిరి అని పేరు వచ్చింది. చివరకు కాలక్రమంలో ఆదోనిగా రూపాంతరం చెందింది. రెడ్డి రాజులు, శ్రీకృష్ణ దేవ రాయలు, మొగలులు, సుల్తానులు ఆ తర్వాత ఆంగ్లేయులు పరిపాలనలో ఆదోనికి వర్తక వాణిజ్య నగరం గా పేరు పొందింది. అందువల్ల సుమారు 160 ఏళ్ల క్రితమే బ్రిటిష్ వారు ఆదోని కేంద్రంగా మున్సిపాలిటీ ని ఏర్పాటు చేశారు. 1990 దశకం వరకు వర్తక వాణిజ్య రంగాల్లో ఆదోని ఒక వెలుగు వెలి గింది. రెండో ముంబాయి గా పేరు పొందింది. ఆ తర్వాత వ్యాపారాలు దివాళా తీశాయి. ఒక తరం వెళ్లిపో యింది. తర్వాత తరాలు కొన్ని వ్యాపారాలు మాని, ఉద్యోగాలు, విదేశాలు అంటూ వెళ్లిపోయారు. దీంతో గత వైభ వమంతా కాలగర్బంలో కలిసిపోయింది. కథలు కథలుగా చెప్పుకోడానికే మిగిలింది. ఆ రోజుల్లో నూలు, ఆయిల్ మిల్లులు, కాటన్ జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉండేవి. వేల మందికి ఉపాధి లభించేది. అవన్నీ కనుమరుగైపోవడంతో కాంతి సన్నగిల్లిపోయింది. ఆదోనికి ఉమ్మడి జిల్లా కేంద్రం కర్నూలు 100 కిమీ దూరంలో ఉంది. అయితే అభివృద్ధి అంతకన్న ఎక్కువ దూరంలోనే ఆగిపోయింది. కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు జిల్లాలను ఆనుకుని, అటు ఆలూరు ఇటు పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు దగ్గరగా ఆదోని నియోజకవర్గం ఉంది. ప్రస్తుతం ఇందులో కేవలం ఆదోని మండలం మాత్రమే ఉంది. ఇకపోతే ఇక్కడ పండే పత్తి, వేరుశెనగ క్రయ విక్రయాల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఆదోని నుంచి దేశ వ్యాప్తంగా నిత్యం ఎగుమతులు జరుగుతూనే ఉంటాయి.

   నియోజకవర్గంలో వాల్మీకులు, మైనారిటీలు, కురువలు ఎక్కువ శాతం ఉన్నారు. ఈ మూడు సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అయితే రెడ్డి, వైశ్య, కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ సార్లు ఎమ్మెల్యే లు గా గెలుపొందారు. గతంలో ఆదోని నుంచి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి కుమారుడు పోటీ చేసి, ప్రస్తుత టీడీపీ ఇంచార్జ్ మీనాక్షినాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు ఆదోని నియోజక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. ఈ సారి గెలిచిన వారికి ఏ పార్టీలో ఉంటే వారికి ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని ప్రజలు ఎప్పటిలా ఆశిస్తున్నారు. అలా వస్తే కనీసం బైపాస్ రోడ్డయినా వేస్తా రని ఆశపడుతున్నారు.

    ఆదోని నియోజకవర్గంలో వర్షాధారంగా సాగు చేసే పంట పొలాలే ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం. ఈ నియోజకవర్గంలో పెద్ద తుంబలం కోదండరామ దేవాలయం, జైన్ తీర్థ్, ఆదోని జామియా మస్జీద్ వంటి చారిత్రక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి వెళ్లి మీనాక్షినాయుడు, TG విశ్వప్రసాద్ సినీ నిర్మాతలుగా రాణించారు. ఒకనాటి హీరోయిన్ మాధవి జన్మస్థలం ఆదోని. తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే వలస వెళ్లిపోయారు. కానీ తన బంధువులను కలవడానికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటారు.

      ఇటీవల ఆదోని పురాతన చెరువు రామజలని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతున్నారు. ఆదోని చుట్టూ కొండలు న్నాయి. వీటిల్లో రణమండల ఆంజనేయ స్వామి కొండ చాలా పవిత్రమైనదిగా ఆదోని ప్రజలు భావిస్తారు. ఇక్కడే అత్యంత పురాతన మైన కోట శిథిలాలు కూడా ఉన్నాయి. 11 శతాబ్దంలో నిర్మించిన రాజకోట, కారాగారం, శిల్ప సంపద, కొండపైన 8 కిలోమీటర్ల మేర నిర్మించిన ప్రహరీ గోడలు దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తగిన సౌకర్యాలు కల్పించి ఉంటే ఆదోని అభివృద్ధి చెంది ఉండేది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నా, ఏ ఎమ్మెల్యే కూడా స్పందించ లేదనే విమర్శలున్నాయి. నియోజకవర్గంలో వీటితో పాటు అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ కోదండరామ దేవాలయం 5 వ శతాబ్దంలో నిర్మించినదిగా చరిత్ర ఆధారాలున్నాయి. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం ఏర్పాటు మొదలై, తర్వాత హంపికి మారిందని ప్రజల నమ్మకం. ఈ గ్రామంలో ఏ ఇంటి నిర్మాణం కోసం తవ్వినా అక్కడ శిలలు, శిల్పాలు సహజంగా లభిస్తుంటాయి. 1990లో జైనుల దైవం మహావీరుడువిగ్రహం ఇక్కడే దొరికింది. అయితే దీనిని ఉత్తర భారతదేశానికి తరలించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయాయి.

     ప్రస్తుతం 167 జాతీయరహదారిని ఆదోని కి అనుసంధానం చేశారు. ఇప్పటి వరకు నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడో జిల్లా కావాల్సినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇక్కడ ఆదోని చుట్టూ రాతి కొండలు, వర్షాధార వ్యవసాయ భూములున్నాయి. కానీ ఏ నది ప్రవాహం లేదు. సుమారు లక్ష ఎకరాల వర్షాధార వ్యవసాయ భూములు, LLC కింద 10 వేల ఎకరాల ఆయకట్టు భూములున్నా అంతంత మాత్రంగానే సాగునీరు అందుతోంది. ఆదోని నియోజకవర్గంలో రైతులు వాణిజ్య పంటలపై ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు. ముఖ్యంగా పత్తి, వేరుసెనగ, వాము, శనగ పంటలను అధికంగా సాగు చేస్తారు. అందువల్ల ప్రతి ఏడాది ఇక్కడి వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి దేశం నలుమూలలకు పత్తి ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. గతంలో ఆదోని నుండి కాటన్ టెక్స్ టైల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు తమ ఉత్పత్తులను యావత్ దేశానికి ఎగుమతి చేసేవి. కానీ ప్రస్తుతం అవన్ని మూతపడి ఉపాధి లేకపోవడంతో వ్యవసాయ కూలీలు, కార్మికులతోపాటు చదువుకున్న యువత కూడా వలసబాట పడుతు న్నారు.

     రాజకీయంగా చైతన్యం తప్ప, నియోజకవర్గ పరంగా అభివృద్ధి శూన్యం. 30 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఇప్పటికీ పంటలన్నీ వర్షాధారమే. లేదంటే బోర్ల మీద ఆధారపడి చేయాలి. వరుణుడు కరుణిస్తేనే, ఈప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. లేదంటే కరువు విలయతాం డవం చేస్తుంది. ఇప్పటికి సాగు నీరు లేక పంటలకు ట్యాంకర్లతో నీరందిస్తూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

     ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య తీరాలంటే గుండ్రేవుల, వేదవతి, RDS కుడి కాలువ ప్రాజెక్టులు పూర్తి కావాలి. అది జరిగితే ఆదోని డివిజన్ లో సుమారు లక్ష ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. 2018 లో జరిగిన పనులే తప్ప, నేటికీ ముందడుగు పడిన దాఖలాలు లేవు. ఆ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయా? అని ఇక్కడి రైతులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. సుమారు 2 లక్షల జనాభా ఉన్న పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు కేవలం మూడు మాత్రమే ఉండటంతో పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ఇక వైద్యశాలలో భవనాలు, వైద్యుల కొరత లేకపో యినా పరికరాల కొరత చాలా ఉంది. ప్రతి చిన్నసమస్యకు కర్నూలు వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఆదోని నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలి. ఆదోనిని జిల్లా చేసి రెండు నియోజక వర్గాలు చేసి, .ఇక్కడ టెక్స్ టైల్ పార్క్, టమాటా జ్యుస్ ఇండస్ట్రీ, ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఎవరైతే ఏర్పాటు చేస్తారో వారికే ఈసారి ఓటు వేయాలని యువత ఆలోచిస్తోంది. వారి కోరిక తీరుతుందా లేదా వేచిచూద్దాం…

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్