సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే!

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. అలాగే తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు సంభందించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు చేరుకోని ‘వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌’ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సా. 4 గంటలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి చేరుకొని.. ఎంపీ కుమారుడు, దంపతులను ఆశీర్వదించనున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్