సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే!

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. అలాగే తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు సంభందించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు చేరుకోని ‘వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌’ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సా. 4 గంటలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి చేరుకొని.. ఎంపీ కుమారుడు, దంపతులను ఆశీర్వదించనున్నారు.

Latest Articles

టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా

మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్‌ తగిలింది. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుఖేందురే రాజీనామా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి అందజేశారు. పార్టీకి కూడా రాజీనామా చేసినట్టు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్