టీడీపీ రెండో విడత సీట్ల ప్రకటనపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. రేపు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 50 అసెంబ్లీ, 17 లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. పలువురు నేతలను ఉండవల్లికి పిలిచి మాట్లాడుతున్నారు బాబు. నిన్న గోపాల పురం, కొవ్వూరు,వెంకటగిరి నేతలతో మంతనాలు జరిపారు. ఇవాళ మరికొంతమంది నేతలతో మంత నాలు జరిపే అవకాశం ఉంది. మొదటి విడత జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్ర బాబు. ప్రస్తుతం సెకండ్ లిస్ట్పై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు, ఆశా వహులతో మంతనాలు జరుపుతున్నారు. 50 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రెండో జాబితాలో మిగిలిన అభ్యర్థులను ప్రకటిస్తారా! లేక మరో జాబితా ఉంటుందా అనే అంశంపై టీడీపీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.