భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలి- ఈటల

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఏబీవీపురంలో భూదాన్ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత కుటుంబాలు చేపట్టిన నిరసనకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంఘీభావం ప్రకటించారు. ఆచార్య వినోభా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమంలో భాగంగా నిరుపేదలకు ఒక్కో కుటుంబానికి 60 నుంచి 70 గజాల చొప్పున సుమారు 850 కుటుంబాలకు స్థలాలు పంపిణీ చేసిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఈ భూములపై ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా జీవిస్తున్న పేదలకు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పూర్తి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. భూదాన్ భూముల సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని ఈటల రాజేందర్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Latest Articles

బీఆర్ఎస్వీ నేతలపై కేసు నమోదు

జీవో నంబర్ 7 రద్దు చేయాలని, పదివేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని ఇటీవల సెక్రటేరియట్ ముట్టడించిన బిఆర్ఎస్వీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సెక్రటేరియట్‌ ముట్టడి సందర్భంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్