సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని.. అలా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్కి ఆ మాట చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు అయినా కట్టారా… రేవంత్ చేసేది చెప్పరు.. చెప్పింది చేయరని విమర్శించారు. తాము చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పొంగులేటి వచ్చి..6 వేల ఇళ్లు ఇస్తామన్నారు.. 6 అయినా కట్టారా? అని కేటీఆర్ నిలదీశారు. దేశం మొత్తం కాంగ్రెస్ను వదిలించుకుంటే..తెలంగాణలో నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. సీఎం కాకముందు రైతులకు 3 గంటల కరెంట్ చాలన్నారని.. మేం 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని గుర్తు చేశారు. రైతు డిస్కం కాదు.. రైతును చంపే డిస్కం అని ఆరోపించారు. కేసీఆర్ అప్పు చేసి సంక్షేమ పథకాలు చేపట్టారని… రేవంత్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేశారని ప్రశ్నించారు. రైతుబంధు లేదు కానీ రాహుల్ బంధు నడుస్తోందని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ను దేశమంతా వదిలించుకుంటుంది- కేటీఆర్
0
35
Previous article
Next article
Latest Articles
సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో మతబోధనల వివాదం.. పాఠశాల దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ స్కూల్లో హోమ్వర్క్కు సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. సైదాబాద్లోని సక్సెస్ స్కూల్లో విద్యార్థులకు మతపరమైన హోం వర్క్ ఇవ్వడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యాన్ని...
- Advertisement -
- Advertisement -


