32.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

MLC Kavitha |ఈడీ నోటీసుల‌పై స్పందించిన కవిత

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ జారీ చేసిన నోటీసుల‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) స్పందించారు. ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని… కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటానని ప్రకటనలో తెలిపారు. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్ అని వెల్లడించారు.

ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించేలా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని.. ఇందుకుగాను ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను సిద్ధమైందని తెలిపారు. దీనిని నీరుగార్చేందుకు మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసిందని కవిత వివరణ ఇచ్చారు.

Read Also: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక మలుపు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలకు 43 ఏళ్లు

 తుపాకీ తూటాల వర్షానికి, ఇంద్రవెల్లి రక్తపాతానికి నేటికి 43 ఏళ్లు. జల్..జంగిల్, జమీన్ అనే నినాదంతో ఆదివాసీలు కదం తొక్కిన రోజది. భూమికోసం, భుక్తి కోసం జరిగిన పోరాటంలో ఖాకీల తూటాలకు ఎందరో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్