ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా భువనగిరి మార్కెట్ను పరిశీలించారు నేతలు. ఐకేపీ సెంటర్కి పంట తెచ్చి 40 రోజులైనా ఇప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ట్రాన్స్పోర్టుకి లారీలు కూడా లేవంటున్నారు. రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు పడుతున్నామని రైతులు వివరించారు. తడిచిన ధాన్యాన్ని బీజేపీ నేతలకు చూపించారు. కొనుగోళ్లలో తమకు తీవ్రంగా అన్యాయం చేస్తున్నారని అన్నారు. తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపించారు. బస్తాలు కుట్టే సుతిలీ దారం కూడా తామే కొంటున్నామని రైతులు బీజేపీ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం
0
15
Latest Articles
కాంగ్రెస్లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


