ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ..సంచలన విషయాలను వెల్లడించింది. వివాహ సమయంలో ట్విషా శర్మ కుటుంబం నుంచి అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్ రూ. 2 లక్షలు డిమాండ్ చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అత్త డిమాండ్ చేసిన డబ్బును ట్విషా కుటుంబ సభ్యులు ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లైన తర్వాత ట్విషా శర్మను మానసికంగా, శారీరకంగా వేధించినట్టు భర్త సమర్థ్ సింగ్, అత్తపై ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేధింపులు, అనుమానాస్పద మృతి, కుట్ర తదితర కోణాల్లో కేసు నమోదు చేసుకున్న సీబీఐ.. దర్యాప్తు చేస్తోంది.
విదాయ్ సమయంలో రూ.2 లక్షలు డిమాండ్.. ట్విషా శర్మ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు
0
6
Previous article
Latest Articles
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా భువనగిరి మార్కెట్ను పరిశీలించారు నేతలు. ఐకేపీ సెంటర్కి పంట తెచ్చి 40 రోజులైనా ఇప్పటికీ...
- Advertisement -
- Advertisement -


