స్వర్ణ కుప్పం విజన్‌ డాక్యుమెంట్ ఆవిష్కరించిన చంద్రబాబు

2014-2019 మధ్య ఏపీ అభివృద్ధి పథంలో నడిచిందని.. వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారాయన. హైదరాబాద్‌లో తాను చేసిన అభివృద్ధితో నేడు ఫలాలు వస్తున్నాయని చెప్పారు. చిత్తూరు జిల్లా ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం- విజన్‌ 2029 డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

ప్రతి ఇంటికీ పారిశ్రామికవేత్త ఉండాలనేది నా విజన్‌. కుప్పం అభివృద్ధికి ప్రణాళికలు రచించాం. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జీవితంలో ఒకేసారి అవకాశం వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి పరిస్థితి ఎదురవుతుంది. ఇది అన్ని రంగాలకూ వర్తిస్తుంది.

విజన్‌ డాక్యుమెంట్ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. అందరూ భాగస్వాములు కావాలి. ఉద్యోగాలు చేయడమే కాదు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండాలి. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తీర్చగలిగే ఎమ్మెల్యేలు ఎప్పుడూ పదవుల్లో ఉంటారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నుంచి కుప్పంలో టీడీపీయే గెలుస్తుంది. పోటీ చేసిన ప్రతీసారీ గెలిపించారు. కుప్పం ప్రజలకు నా ధన్యవాదాలు.. అని చంద్రబాబు అన్నారు.

Latest Articles

నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి

విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్