స్పూర్తి కుటుంబం.. తెలంగాణ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్: ఆధ్యాత్మిక విశ్వ గురువులు, సైంటిఫిక్ సెయింట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి దివ్య ఆశీసులతో స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఏడాది కాలంగా సేవలు అందిస్తున్నది. ఈ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 24వ తేది, శనివారం నాడు హైదరాబాద్ చంపాపేట్‌లోని సామ సరస్వతి గార్డెన్స్ జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వర రావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కార్యక్రమ వివరాల్ని స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ వెల్లడించింది. శనివారం ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి ట్రస్ట్ కార్యాలయంలో గురుపూజ, 108 సార్లు మూల మంత్రోచ్ఛారణ చేపడతారు. సాయంత్రం 3.30 గంటల నుంచి 5గంటలవరకు చంపాపేటలో విశ్వ చైతన్య రథయాత్ర ఏర్పాటైంది. సాయంత్రం. 5.45 గంటల నుంచి 8.30గంటల వరకు ప్రథమ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై, వేడుకలను దిగ్విజయం చేయాలని స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్ట్ ఆహ్వానిస్తోంది.

Latest Articles

చంద్రబాబు పాలనంతా దగా, మోసం, అబద్ధాలు, స్కాములే- వైఎస్ జగన్

డీఎస్సీలో స్కామ్‌లు జరిగాయని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. " ఏపీ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. 16వేల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్