స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరమని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. “కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవత్వంతో వ్యవహరించాలి. వైసీపీ హయాంతో కార్మికులకు ఇబ్బందులు రాలేదు. వైసీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకుంది. ప్రైవేటీకరణ జరగకూడదని గట్టిగా చెప్పాం. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్టీల్ప్లాంట్లో 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో మరికొంత మంది ఉద్యోగులను తప్పించారు” .. అని జగన్ అన్నారు.
రూ.కోటి ఆర్థికసాయం ఇవ్వాలి-జగన్
0
28
Previous article
Next article
Latest Articles
ఉద్ధవ్ థాక్రే శిబిరంలో చీలిక
శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ప్రత్యేక పార్లమెంటరీ గ్రూప్ను ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై చర్చ జరుగుతోంది. దీంతో ఆపరేషన్ టైగర్పై మరోసారి చర్చ మొదలైంది. 2022లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన...
- Advertisement -
- Advertisement -


