బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. స్క్రీన్ను పక్కనపెడితే… దిమ్రీ గత కొన్ని సంవత్సరాల క్రితం తాను కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ ఆస్తులతో వార్తల్లో నిలిచింది. ముంబైలోని బాంద్రాలో దక్షిణాన రూ.14 కోట్ల విలువైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఆ ఇల్లు గ్రౌండ్ ప్లస్ రెండు అంతస్తుల భవనం కాగా, నగరంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన కార్టర్ రోడ్ సమీపంలో ఉంది.

ఈ ఆస్తి 2,226 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 2,194 చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణం ఉండడంతో, ఇది ఆ ప్రాంతంలోని ప్రీమియం నివాస ఆస్తుల్లో ఒకటిగా నిలుస్తుంది.




