హైదరాబాద్లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై ఐకాన్ స్టాక్ అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందన్నారు. అలాగే ఈ సంఘటన తర్వాత సెలెబ్రేషన్స్లో కూడా యాక్టివ్గా పాల్గొనలేకపోయామని తెలిపారు. ఐతే గత 20 ఏళ్లుగా సంధ్య థియేటర్లో సినిమాలు చూడటానికి వెళ్తున్నామని.. ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. మృతురాలి కుటుంబానికి తన తరపు నుంచి.. అలాగే పుష్ప 2 బృందం నుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇక ఏం చేసినా జరిగినదానిని మార్చలేమని కానీ రేవతి కుటుంబానికి అండగా నిలిచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.. అలాగే బాలుడి ట్రీట్మెంట్కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. తాము కష్టపడి సినిమాలు తీసేది ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యడానికేనని.. కాబట్టి థియేటర్కి జాగ్రత్తగా వెళ్లి సినిమా చూసి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు అల్లు అర్జున్.