29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్‌కు ఊరట

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాపై రాహుల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ గతంలో పరువునష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో ఝార్ఖండ్‌లోని ట్రయల్ కోర్టు విచారణపై తాజాగా సుప్రీంకోర్టు స్టే విధించింది.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్‌ షా గౌరవానికి భంగం కలిగించేలా రాహుల్‌ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేత నవీన్‌ ఝా ఫిర్యాదుచేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణను రద్దు చేయాలంటూ ఝార్ఖండ్‌ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆయనకు ఊరట లభించింది.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్