ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా?- లోకేశ్

మాజీ సీఎం జగన్‌పై ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన ‘గొడ్డలి పార్టీ’ కార్యకర్తలను రంగంలోకి దింపారని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసీపీ నేతల అనుచరుడేనని చెప్పారు. వైసీపీ నాయకుడి అనుచరుడని పోలీసులు నిర్ధారించారని తెలిపారు. జగన్ నాటకాలు చూసి జనాలు ఛీకొట్టినా.. ఆయన డ్రామాలు మానడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా? అంటూ నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Latest Articles

24 గంటల కరెంట్‌ ఇస్తేనే ఓట్లు అడగాలి- హరీశ్ రావు

రైతు డిస్కంపై సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌ విసిరారు. 24 గంటల కరెంట్‌ ఇస్తేనే ఓట్లు అడుగుతానని రేవంత్‌ చెప్పగలరా? అని అన్నారు. ప్రభుత్వ చర్యలు గమనిస్తుంటే..కరెంట్‌ కోతలు, నీటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్