25.2 C
Hyderabad
Friday, February 14, 2025
spot_img

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉంది- నారా లోకేశ్

స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam) ఏలూరు జిల్లాలో కొనసాగుతోంది. లోకేశ్ ఇవాళ శ్రీరామవరంలో పోలవరం ప్రాజెక్టు(Polavaram) నిర్వాసితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం ప్రమాదంలో ఉందని తెలిపారు. డయాఫ్రం వాల్ పరిస్థితిపై స్పష్టత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఈ ప్రభుత్వం ఏమీ చెప్పలేకపోతోందని లోకేశ్ విమర్శించారు. సమగ్ర అధ్యయనం చేస్తే తప్ప… పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొన్నారు.

 

“గతంలో మేం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. నాడు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. జగన్ లాగా మాయ మాటలు చెప్పి, రేపు అధికారంలోకి వచ్చాక పరదాలు కట్టుకుని తిరగాలనే కోరిక నాకు లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంపై బాధ్యత తీసుకుంటాను.

45.72 మీటర్ల ఎత్తుతో పోలవరం కట్టాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు తెలంగాణ నుంచి ముంపు మండలాలను మోదీ గారి సహకారంతో విలీనం చేసుకున్నాం. ఇప్పుడు టీడీపీ లక్ష్యం ఏంటంటే… నిర్దేశించిన ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడం, నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద అందజేయడం, నిర్వాసితులకు మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలు నిర్మించడం. టీడీపీ అధికారంలోకి వచ్చాక తప్పక నెరవేరుస్తామని వీటన్నింటిపై ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా” అని లోకేశ్ తెలిపారు.

Latest Articles

ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

ఈ నెల 19వ తేదీన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత KCR నిర్ణయించారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్