కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడంతో ఎలా నియమించారంటూ కౌన్సిలర్లు నిరసన చేశారు. వైసీపీ హాయాంలో అవినీతి పనులపై టీడీపీ కౌన్సిలర్లు విచారణకు డిమాండ్ చేశారు. ఛైర్మన్, మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్ చేశారు. వైసీపీలోని ఒక వర్గం కౌన్సిలర్లు టీడీపీకి జత కలిసింది. 30మంది కౌన్సిలర్లలో 24మంది వాకౌట్ చేశారు. కోరం లేక చైర్పర్సన్ గండేపల్లి సూర్య వతి సభను వాయిదా వేశారు.
రసాభాసగా మారిన పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్
0
355
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


