పవన్ కళ్యాణ్ అసలైన సెక్యులర్ వాది – నాగబాబు

తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీలో రాజకీయ ప్రకంపనలు రాజేస్తోంది. లడ్డూలో వాడిన నెయ్యి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కల్తీ కావడంతో కూటమి పార్టీలు, విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హిందూ మనోభావాలకు సంబంధించిన ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందువులే హిందువులను అవమానించడం సబబుకాదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ అదే విషయాన్ని ప్రస్తావించారని అన్నారు. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని సమర్థించారు. పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అని ఎద్దేవా చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. దోషులెవరున్నా బయటకు వస్తారని తెలిపారు.

Latest Articles

మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్