వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కల్లాల్లోని ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తైన కేంద్రాల నుంచి టార్పాలిన్లను తరలించాలని చెప్పారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.
పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన రేవంత్ రెడ్డి
0
8
Latest Articles
సీఎంగా డీకే… పలువురు డిప్యూటీల ప్రతిపాదనలు
కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీలాట ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ఉత్కంఠభరితంగా అధికార మార్పిడి చర్చలు కొనసాగుతున్నాయి. సిద్ధరామయ్య-డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కీలక ములుపు తిరిగింది. కాంగ్రెస్ అధిష్టానం డీకే శివకుమార్...
- Advertisement -
- Advertisement -


