30.6 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: దసరా పండుగ ఏ రోజు జరుపుకోవాలి…అని ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు నెలకొంది. అయితే ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. దసరా పండుగ ఈ నెల 23న ఉంటుందని తెలంగాణ ప్రకటించింది. రాష్ట్ర ప్రజలందరూ 23న విజయదశమి జరుపుకోవాలని సూచించింది. 100 మంది సిద్ధాంతులు ధర్మశాస్త్రానుసారం చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపింది. ఈ నిర్ణయాన్ని శృంగేరి జగద్గురువులు, కంచి కామకోటి పీఠాధిశ్వరులు, పుష్పగిరి పీఠం, గురుమదనానంద పీఠం పీఠాధిశ్వరులు ఆమోదించారంది.
కాగా, పలు క్యాలెండర్లలో ఈ నెల 24న దసరా అని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, ప్రభుత్వ స్కూళ్లలో దసరా నాటికి ప్రారంభించాల్సిన సీఎం అల్పాహార పథకాన్ని ఈ నెల 6న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ఉండటంతో 6 నుంచి జిల్లాకు ఒక స్కూలులో పథకం అమలు చేసి పరిశీలించనుంది. అక్టోబర్ 26న స్కూల్లు పునః ప్రారంభం కానుండగా… లోపాలను సరిచేసి అన్ని పాఠశాలలకు విస్తరించాలని భావిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్