హైదరాబాద్‌ బొల్లారం మహిళ హత్య కేసులో కీలక మలుపు.. భర్తే హత్య చేశాడని నిర్ధారణ

హైదరాబాద్‌ బొల్లారం ప్రాంతంలో మహిళ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మొదట గుర్తుతెలియని దుండగులు దాడి చేసి తన భార్యను హత్య చేశారని భర్త అనిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూరగాయల మార్కెట్ నుంచి ఇంటికి వస్తుండగా దాడి జరిగిందని, తనపై కూడా కత్తితో దాడి చేశారని చెప్పాడు. మృతురాలు మీనా, భర్త అనిల్‌తో కలిసి బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనిల్ చెప్పిన వివరాల్లో పొంతన లేకపోవడం గమనించారు. అనుమానం రావడంతో అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో భార్య మీనాను హత్య చేసింది భర్త అనిలేనని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్య అనంతరం దుండగులు దాడి చేసినట్లు నాటకం ఆడినట్లు దర్యాప్తులో బయటపడింది. భార్య గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతులు గత 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారని, ఇటీవల కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారని స్థానికులు చెబుతున్నారు. వారిద్దరి మధ్య పెద్దగా గొడవలు ఉన్నట్లు ఎవరూ  చెప్పకపోవడంతో హత్యకు అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్త అనిల్ పోలీసుల అదుపులో ఉండగా, మరిన్ని వివరాలు విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Latest Articles

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ … రేపు మూడు నోటిఫికేషన్లు…నియామక పక్రియ అంతా ఆన్లైన్ మోడ్‌లోనే

చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు మూడు నోటిఫికేషన్లను ఇచ్చేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిద్ధమైంది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్